వైరల్ అవుతున్న ఎన్టీఆర్ బయోపిక్ ఫొటోస్ !

వైరల్ అవుతున్న ఎన్టీఆర్ బయోపిక్ ఫొటోస్ !

Published on Oct 8, 2018 12:35 PM IST


క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో ‘ఎన్టీఆర్ బయోపిక్’ చిత్రం శరవేగంగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం, నాలుగు షెడ్యూల్స్ ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. కాగా తాజాగా ఈ రోజు నుండి ప్రస్తుతం దివిసీమ ప్రాంతాలు అయిన హంసలదీవి, కోడూరు ప్రాంతాల్లో ఎన్టీఆర్ బయోపిక్ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది.

కాగా అప్పట్లో దివిసీమ ఉప్పెన వచ్చిన సంగతి తెలిసిందే. ఆ ఉప్పెనలో సర్వం కోల్పోయిన అభాగ్యులను ఆదుకోవడానికి అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్‌ విరాళాలు సేకరించారు. క్రిష్ ఆ దృశ్యాలను చాలా చక్కగా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఆ దృశ్యాల తాలూకు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరో రెండు నెలల్లో ఈ చిత్రం టాకీ పార్ట్ ని పూర్తి చెయ్యాలని క్రిష్ భావిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే ట్యూన్స్ కూడా అద్భుతంగా వచ్చాయట. ఈ చిత్రానికి ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి, యువ నిర్మాత విష్ణు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు