మరోసారి సూపర్ స్టార్ తో మాటల మాంత్రికుడు…కానీ ?

మరోసారి సూపర్ స్టార్ తో మాటల మాంత్రికుడు…కానీ ?

Published on Mar 27, 2024 6:30 PM IST

టాలీవుడ్ స్టార్ యాక్టర్స్ లో ఒకరైన సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల త్రివిక్రమ్ శ్రీనివాస్ తీసిన గుంటూరు కారం మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చారు. త్వరలో దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తో తన తదుపరి SSMB 29 మూవీ చేయనున్నారు మహేష్. ఈమూవీ త్వరలో అనౌన్స్ కానుంది. విషయం ఏమిటంటే, ఇప్పటికే త్రివిక్రమ్ తో మొత్తం మూడు సినిమాలు చేసిన మహేష్, రాబోయే రోజుల్లో మళ్ళి ఆయనతో ఒక ప్రాజక్ట్ చేయనున్నారనేది లేటెస్ట్ టాలీవుడ్ బజ్.

కానీ ఈసారి మాత్రం భారీ థ్రిల్లింగ్ యాక్షన్ ఎంటర్టైనర్ ద్వారా ఈ జోడీ మన ముందుకు రానున్నారని, నిజానికి గుంటూరు కారం మూవీ ప్రారంభం టైంలో అనుకున్న హై ఆక్టేన్ యాక్షన్ ఎంటర్టైనర్ స్టోరీనే ఈసారి అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కించనున్నారట. అయితే ఇది రూపుదిద్దుకోవడానికి చాలా టైం పట్టనుందని తెలుస్తోంది. మరి ఈ క్రేజీ భారీ ప్రాజక్ట్ ని ఎవరు నిర్మిస్తారో, ఎప్పుడు తెరకెక్కుతుందో తెలియాలి అంటే కాలమే సమాధానం చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు