సెన్సార్ పూర్తి చేసుకున్న ‘పక్కా కమర్షియల్’….ఇక రిలీజ్ కు రెడీ

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘పక్కా కమర్షియల్’….ఇక రిలీజ్ కు రెడీ

Published on Jun 28, 2022 8:00 PM IST

యాక్షన్ స్టార్ గోపిచంద్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పక్కా కమర్షియల్ పై ఆయన ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. తొలిసారిగా యువ డైరెక్టర్ మారుతీ తో కలిసి గోపీచంద్ చేస్తున్న ఈ మూవీ మంచి యాక్షన్, కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కినట్లు తెలుస్తోంది. యంగ్ బ్యూటీ రాశి ఖన్నా హీరోయిన్ గా నటించిన ఈ మూవీని యువి క్రియేషన్స్, గీత ఆర్ట్స్ 2 సంస్థలపై బన్నీ వాసు నిర్మించారు.

ఇటీవల ట్రైలర్ తో అందరిలో మరింతగా అంచనాలు పెంచేసిన పక్కా కమర్షియల్ మూవీ నేడు సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ మూవీకి సెన్సార్ వారు యు/ఏ సర్టిఫికెట్ ని అందించినట్లు కొద్దిసేపటి క్రితం అఫీషియల్ గా ప్రకటించింది యూనిట్. జులై 1 న రిలీజ్ కానున్న తమ మూవీ తప్పకుండా పెద్ద సక్సెస్ కొట్టి ఆడియన్స్ అందరి అంచనాలు అందుకుంటుందని పక్కా కమర్షియల్ మూవీ టీమ్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే ఈ మూవీకి జేక్స్ బెజోయ్ అందించిన సాంగ్స్ అన్ని కూడా శ్రోతలను ఎంతో ఆకట్టుకున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు