అన్నయ్య కీర్తి కిరీటంలో చేరిన మరొక వజ్రం – పవన్ కళ్యాణ్

అన్నయ్య కీర్తి కిరీటంలో చేరిన మరొక వజ్రం – పవన్ కళ్యాణ్

Published on Nov 20, 2022 10:33 PM IST

టాలీవుడ్ అగ్ర హీరో, మెగాస్టార్ చిరంజీవి ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ 2022 అవార్డ్ ను సొంతం చేసుకున్నారు. ఈ మేరకు మెగాస్టార్ చిరంజీవి కు పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు అంతా విషెస్ తెలుపుతున్నారు.

సోదరుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం e మేరకు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగు చలన చిత్రసీమలో శిఖర సమానులు, అన్నయ్య శ్రీ చిరంజీవి గారిని ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ – 2022 పురస్కారం వరించడం ఎంతో సంతోషాన్ని కలిగించింది. గోవాలో జరుగుతున్న 53వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో భాగంగా భారత ప్రభుత్వం ప్రకటించిన ఈ పురస్కారం అన్నయ్య కీర్తి కిరీటంలో చేరిన మరొక వజ్రం.

ఈ ఆనంద సమయంలో నా మార్గదర్శి అన్నయ్య చిరంజీవి గారికి హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తున్నాను. నాలుగు దశాబ్దాలు పైబడిన అన్నయ్య సినీ ప్రస్థానం, తనను తాను మలచుకొని ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థానం సంపాదించుకోవడం నాతో సహా ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం. అంతర్జాతీయ చలన చిత్ర వేదికపై అన్నయ్య చిరంజీవి గారికి ఈ గౌరవం దక్కుతున్నందుకు ఎంతో ఆనందిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు