సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘సాహో’. ఈ సినిమాలో ప్రభాస్ సరసన శ్రద్ధాకపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాను 2019 స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగస్టు 15న విడుదల చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే చిత్రబృందం నుంచి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ చిత్రానికి శంకర్ ఎహసాన్ లాయ్ సంగీతం అందిస్తున్నారు. కాగా ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ ‘యు.వి క్రియేషన్స్’ నిర్మిస్తున్న ఈ చిత్రంలో గ్రాఫిక్స్ తో కూడుకున్న యాక్షన్ సీక్వెన్స్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.