ప్రభాస్ “ఏ- ఆది పురుష్” లేటెస్ట్ అప్ డేట్ ?

ప్రభాస్ “ఏ- ఆది పురుష్” లేటెస్ట్ అప్ డేట్ ?

Published on Dec 6, 2020 1:00 AM IST

నేషనల్ స్టార్ గా ప్రభాస్ బాలీవుడ్ బడా ద‌ర్శ‌కుడు సంజ‌య్ రౌత్ తో “ఏ- ఆది పురుష్” అనే మరో భారీ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా షూటింగ్ ను జనవరి నుండి చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారట. ఇప్పటికే ప్రభాస్ జనవరిలో టెన్ డేస్ డేట్స్ కూడా ఇచ్చాడట. మెలుహ పాత్రల శైలిలో ప్రభాస్ పాత్ర సాగుతోందని తెలుస్తోంది. మెలూహ నాయకుడిగా అంటే మనిషి రూపంలో ఉండే నాగుల జాతికి సంబంధించిన నాయకుడిగా అన్నమాట.

కాగా రీసెంట్ గా రిలీజైన పోస్టర్ లో కూడా ఒక లుక్ అచ్చం మెలూహ నాయకుడి త‌ర‌హా లుక్ లోనే ప్రభాస్ కనిపిస్తున్నాడు. కాగా మెలుహా ల్యాండ్స్ లో సాగే ఈ క‌థ‌లో శివుని పాత్రలో అజయ్ దేవ్‌గణ్ ను విజువ‌ల్ వండ‌ర్ గా కూడా చూపించబోతున్నారని కూడా బాలీవుడ్ మీడియాలో రూమర్స్ వస్తున్నాయి.

కాగా బాలీవుడ్ సంస్థ టీసిరీస్ ఏ బాలీవుడ్ స్టార్ తోనో ఇలాంటి భారీ సినిమాను చేయకుండా, సౌత్ హీరో అయిన ప్రభాస్ తో చేయడం నిజంగా విశేషమే. అన్నట్టు ఈ సినిమాని 3డి విజువ‌ల్ గ్రాఫిక్స్ తో ఒక మ‌హ‌దాద్భుతంగా తెర‌కెక్కించి దేశంలోని అన్ని భాష‌లతో పాటు విదేశాల్లోనూ భారీగా రిలీజ్ చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు