ప్రభాస్ “వర్షం” రీ రిలీజ్ కి రెడీ!

ప్రభాస్ “వర్షం” రీ రిలీజ్ కి రెడీ!

Published on Nov 2, 2022 3:00 PM IST

పాన్ ఇండియా స్టార్ హీరో, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు మరో శుభవార్త. ప్రభాస్ బ్లాక్ బస్టర్ చిత్రం వర్షం అక్టోబర్ 23, 2022 న రీ రిలీజ్ కావాల్సి ఉంది. కానీ వాయిదా పడింది. ఇప్పుడు, అతనికి ఎంతో స్టార్‌డమ్‌ని తెచ్చిపెట్టిన ఈ చిత్రం నవంబర్ 11, 2022 న తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా లలో రీ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు కన్ఫర్మ్ అయింది.

తెలుగు సినీ పరిశ్రమ లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 20 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో మేకర్స్ ఈ డేట్‌ని ఎంచుకోవడం జరిగింది. వర్షం చిత్రానికి యంగ్ హీరో సంతోష్ శోభన్ తండ్రి శోభన్ (దివంగత) దర్శకత్వం వహించారు. MS రాజు నిర్మించిన ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్‌లో త్రిష, గోపీచంద్, ప్రకాష్ రాజ్, సునీల్ మరియు తదితరులు ముఖ్యమైన పాత్రలు పోషించారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు