ఎన్టీఆర్ తో యాక్షన్ సీక్వెన్సెస్ ఏ రేంజ్ లో ఉంటాయో ?

ఎన్టీఆర్ తో యాక్షన్ సీక్వెన్సెస్ ఏ రేంజ్ లో ఉంటాయో ?

Published on Nov 28, 2020 10:06 PM IST

నేషనల్ రేంజ్ లో స్టార్ డమ్ తెచ్చుకున్న డైరెక్టర్స్ లో ‘ప్రశాంత్ నీల్’ కూడా ఒకడు. ప్రశాంత్ ద‌ర్శ‌క‌త్వంలో రాకింగ్ స్టార్ యశ్ కథానాయకుడిగా నటించిన కేజీఎఫ్ సినిమా క్రియేట్ చేసిన రికార్డ్స్ గురించి తెలిసిందే. కాగా ఈ యాక్షన్ డైరెక్టర్ ఎన్టీఆర్ తో ఓ భారీ యాక్షన్ డ్రామా తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం పీరియాడిక్ మూవీ అని, పాకిస్తాన్ – ఇండియా విడిపోయిన కాలంలో జరిగిన కొన్ని పరిస్థుతుల ఆధారంగా ఈ సినిమా కథ ఉంటుందని తెలుస్తోంది.

కాగా పాకిస్తాన్ – ఇండియా మధ్య జరిగిన యుద్ధం వరకూ.. ఆ యుద్ధంలో ఇండియా గెలుపు కోసం ఎంత గొప్పగా పోరాటం చేశారనే కోణంలో ప్రశాంత్ ఈ సినిమాని తీయాలనుకుంటున్నాడట. ఇక ఈ సినిమాని పాన్ – ఇండియా స్థాయిలో దాదాపు 250 కోట్ల బడ్జెట్లో నిర్మించనున్నారట. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్‌తో ఇలాంటి సినిమా తీస్తే.. ఇక యాక్షన్ సీక్వెన్సెస్ ఏ రేంజ్ లో ఉంటాయో. .. పైగా ఈ సినిమా కోసం ఎన్టీఆర్ దాదాపు బల్క్ డేట్స్ కేటాయిస్తున్నారట. 2022లో సెట్స్ పైకి ఈ సినిమా వెళ్లనుందని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు