“మల్లేశం” విడుదలకు డేట్ ఫిక్స్ అయింది !

“మల్లేశం” విడుదలకు డేట్ ఫిక్స్ అయింది !

Published on May 27, 2019 4:58 PM IST

యంగ్ కమెడియన్ ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం “మల్లేశం”. చేనేత కార్మికుడు మరియు పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతకింది మల్లేశం జీవితం ఆధారంగా దర్శకుడు రాజ్ ఆర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

నేత కార్మికురాలిగా తన తల్లి పడుతున్న కష్టాన్ని చిన్నప్పటి నుండి చూసిన మల్లేశం, తన తల్లి లాగా ఇంకెవ్వరూ కష్టపడకూడదని ఓ యంత్రాన్ని కనుగొని, నేత కార్మికుల కష్టాన్ని తగ్గించాడు. మల్లేశం చేసిన కృషికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది కూడా.

కాగా ఈ సినిమాలో ప్రియదర్శికి జోడిగా అనన్య నటిస్తుండగా, శ్రీ అధికార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను జూన్ 21న విడుదల చేస్తున్నట్లుగా చిత్రబృందం అధికారికంగా పోస్టర్ ను విడుదల చేసింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు