IPL 2025: లక్నోపై పంజాబ్ గ్రాండ్ విక్టరీ

IPL 2025: లక్నోపై పంజాబ్ గ్రాండ్ విక్టరీ

Published on Apr 2, 2025 12:00 AM IST

lsg 1

ఐపీఎల్ 2025లో భాగంగా నేడు జరిగిన లోక్నో సూపర్ జియెంట్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది. టాస్ గెలిచిన పంజాబ్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జియెంట్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేశారు.

ఇక 172 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ 16.2 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసి గ్రాండ్ విక్టరీ సాధించింది. ప్రభ్‌సిమ్రన్ సింగ్ (69), శ్రేయాస్ ఐయర్ (52) పరుగులు చేసి జట్టుకి విక్టరీని అందించారు. దీంతో లక్నోపై పంజాబ్ విక్టరీ సాధించి పాయింట్స్ టేబుల్‌లో రెండో స్థానానికి ఎగబాకింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు