సీనియర్ నటుడు నటకిరీటి డాక్టర్ రాజేంద్రప్రసాద్ ముఖ్యపాత్రలో నటించిన చిత్రం ‘బేవర్స్’. ఈచిత్రాన్ని రమేష్ చెప్పాల దర్శకత్వం లో సంజోష్, హర్షిత హీరో హీరోయిన్లుగా కాసం సమర్పణలో ఎస్.ఎస్.కె ఎంటర్ టైన్ మెంట్స్ పతాకం పై నిర్మాతలు పొన్నాల చందు, డా.ఎం.ఎస్.మూర్తి, ఎమ్ అరవింద్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం అక్టోబర్ 12న ప్రంపంచవ్యాప్తంగా విడుదలై విజయం సాధించింది. ఈ సందర్భంగా పాత్రికేయుల సమావేశంలో నటకీరిటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.తెలుగు ప్రేక్షకదేవుళ్ళకి నమస్కారములు తెలియజేస్తూ బేవార్స్ చిత్రాన్ని ఎమోషనల్ హిట్ చేసినందుకు మా చిత్ర యూనిట్ తరపున అందరికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ రోజు మా చిత్రం బావుందని ఒక 10 థియేటర్లు పెంచడం ఆనందంగా ఉంది.
దర్శకుడు రమేష్ చెప్పాల మాట్లాడుతూ అక్టోబర్ 12న విడుదలై ఈ చిత్రం మంచి స్పందన వచ్చింది. మంచి ఆడియో, వీడియో ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. ఈ రోజు హైదరాబాద్లో 9 థియేటర్లలో నైజాంలో5 థియేటర్లు పెంచడం జరిగింది. చాలా మంచి మూవీ ఇది. రాజేంద్రప్రసాద్గారికి అందరికి నా కృతజ్ఞతలు అన్నారు. ప్రొడ్యూసర్ పొన్నాల చందు మాట్లాడుతూ ఇది నా తొలి సినిమా. ఈ ఇంత మంచి హిట్ అయినందుకు గర్వంగా ఉందని అన్నారు.