ఐ యామ్ సేఫ్ అంటున్న సూపర్ స్టార్

ఐ యామ్ సేఫ్ అంటున్న సూపర్ స్టార్

Published on Jan 29, 2020 11:25 AM IST

డెబ్భై ఏళ్ల వయసులో రజిని కాంత్ ఓ సాహస యాత్ర చేశారు. ప్రమాదకర సాహసాలకు పేరుగాంచిన బేర్ గ్రిల్స్ తో కలిసి మ్యాన్ వర్సస్ వైల్డ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా కొన్ని ప్రమాదకర సాహసాలు రజని చేశారు. ఐతే ఈ కార్యక్రమంలో రజిని గాయాలపాలయ్యారని తెలియడంతో ఆయన అభిమానులు చాలా బాధపడ్డారు. తనకు ఏమైయ్యిందో అని అభిమానులు ఆందోళన చెందుతున్న క్రమంలో రజిని వారికి అసలు విషయం తెలియజేశారు. తనకు ఆందోళన చెందాల్సినంతటి గాయాలేవీ కాలేదని, కేవలం కాళ్ళ వద్ద చర్మం గీరుకుపోయింది అని మీడియా ఎదుట వివరణ ఇచ్చారు. దానితో ఆయనపై వస్తున్న వదంతులకు చెక్ పెట్టినట్లైంది.

ఇక ఈ సంక్రాంతి కి దర్బార్ మూవీని విడుదల చేసిన రజిని, మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. దర్బార్ మూవీని దర్శకుడు మురుగదాస్ తెరకెక్కించగా నయనతార హీరోయిన్ గా నటించింది. మరో హీరోయిన్ నివేదా థామస్ రజిని కూతురు పాత్ర చేయడం విశేషం. రజని తన తదుపరి చిత్రం మాస్ డైరెక్టర్ శివ తో చేస్తున్నారు. రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుండగా ఈ మూవీలో మీనా, కుష్బూ వంటి సీనియర్ హీరోయిన్స్ నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు