‘నీది నాది ఒకే కథ’ చిత్రంతో విజయాన్ని అందుకున్నాడు దర్శకుడు ‘వేణు ఉడుగుల’, కాగా ఈ దర్శకుడు తన రెండో చిత్రంగా రానా, సాయిపల్లవిలను హీరోహరోయిన్ లుగా పెట్టి ‘విరాటపర్వం’ అనే చిత్రాన్ని తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్ నుండి షూట్ కి వెళ్ళబోతున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ చిత్రంలో ఓ కీలకమైన పాత్రలో టబు నటించనున్నట్లు తెలుస్తోంది. టబు మానవ హక్కుల నేతగా నటిస్తోందట. ఈ సినిమాను హిందీ, తమిళ భాషల్లోనూ విడుదల చేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక వేణు ‘నీది నాది ఒకే కథ’ చిత్రంలో కూడా హీరో క్యారెక్టర్ మీదే చిత్రాన్ని నడిపించాడు. అలాగే ఈ సినిమానూ రానా క్యారెక్టర్ పైనే నడుపుతాడట.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : రత్నం – సిల్లీ యాక్షన్ ఎంటర్ టైనర్!
- మీకు తెలుసా? : కమల్ తో సౌందర్య చేయాల్సిన మొదటి సినిమా ఇదని
- లెటర్బాక్స్డ్ టాప్ 100 లో మహేష్ బాబు డబుల్ బొనాంజా
- ఈ ఓటిటి ప్లాట్ ఫామ్ లో “ఓ మై గాడ్ 2” తెలుగు
- ‘అఖండ – 2’ : ఆ రోజున అనౌన్స్ మెంట్ రానుందా ?
- ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘ఫ్యామిలీ స్టార్’
- బజ్ : మ్యూజికల్ అప్ డేట్ కి రెడీ అవుతోన్న ‘డబుల్ ఇస్మార్ట్’ ?