‘రజినీ, శంకర్’లనే మోసం చేసిన విఎఫ్‌ఎక్స్‌ కంపెనీ !

‘రజినీ, శంకర్’లనే మోసం చేసిన విఎఫ్‌ఎక్స్‌ కంపెనీ !

Published on Nov 26, 2018 8:59 PM IST

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ విలన్ గా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వస్తోన్న ‘2.ఓ’ చిత్రం ఎప్పుడో విడుదల కావాలి. కానీ విడుదల ఎందుకు ఆలస్యం అయిందో డైరెక్టర్ శంకర్ అసల కారణాన్ని తెలిపారు.

హైదరాబాద్ లోని పార్క్ హైయేత్ లో జరిగిన ‘2.ఓ’ ప్రీరిలీజ్ ఈవెంట్ లో శంకర్‌ మాట్లాడుతూ.. ‘ఈ సినిమా ఎప్పుడో విడుదల అవ్వాలి. కానీ విడుదలకు చాలా కాలం పట్టింది. దానికి కారణం ఓ విఎఫ్‌ఎక్స్‌ కంపెనీ. సినిమా విడుదల తేదికి రెండు నెలలు ముందే మా సినిమాలోని విఎఫ్‌ఎక్స్‌ కు సంబధించిన అవుట్ ఫుట్ మొత్తం పూర్తి చేసి ఇస్తామని ఆ కంపెనీ మాకు నమ్మకంగా చెప్పింది.

కానీ మేం దుబాయ్ లో ఆడియో ఫంక్షన్ పెట్టుకొని ఇక విడుదల తేదీ ఎనౌన్స్ చేద్దామనుకుంటున్న టైంలో.. ఆ కంపెనీ వచ్చి అవుట్ ఫుట్ ఇవ్వడానికి మాకు మరో సంవత్సరం టైం పడుతుందని మాకు చివరి క్షణంలో చెప్పింది. ఇక చేసేది ఏమి లేక విడుదల తేదీని పోస్ట్ ఫోన్ చేసుకున్నాం. ఆ తరువాత ఆ కంపెనీ కన్నా పెద్ద కంపెనీకితో మా వర్క్ చేయించుకున్నాం. చివరకి విఎఫ్‌ఎక్స్‌ విషయంలో నేను పూర్తీ సంతృప్తి చెందాను’ అని సినిమా విడుదల వాయిదాకి అసలు కారణం శంకర్ తెలిపారు.

కాగా ఏఅర్ రహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో అమీ జాక్సన్ కథానాయకిగా నటిస్తోంది. గ్రాఫిక్స్ కి అత్యంత విలువ ఇస్తూ, అద్భుతమైన విజువల్స్ తో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ప్రసాద్ మరియు దిల్ రాజు, యూవీ క్రియేషన్స్ వంశీ సంయుక్తంగా నవంబర్ 29న భారీ స్థాయిలో తెలుగులో విడుదల చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు