తమ పిల్లలు, పవన్ పై ఓ అందమైన ఫోటోను షేర్ చేసిన రేణుదేశాయ్!

తమ పిల్లలు, పవన్ పై ఓ అందమైన ఫోటోను షేర్ చేసిన రేణుదేశాయ్!

Published on Dec 2, 2020 5:20 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు తన మాజీ భార్య రేణు దేశాయ్ ల కోసం ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ప్రస్తుతం వారు విడిపోయి ఎవరి పనులలో వారు నిమగ్నం అయ్యి ఉన్నారు. అయితే వీరి నడుమ స్నేహం మాత్రం అలానే ఉంది అన్న సంగతి తెలిసిందే. ఇక ఇవన్నీ పక్కన పెడితే రేణు దేశాయ్ ఒక అందమైన వావ్ అనిపించే ఫోటోను తన సోషల్ మీడియా ద్వారా షేర్ చెయ్యడం హాట్ టాపిక్ గా నిలిచింది.

ఇందులో పవన్ మరియు తమ పిల్లలు అఖిరా నందన్ మరియు ఆధ్యలు కలిసి ఉన్నారు. ఒక సోఫాలో కూర్చిని ఉన్న పవన్ పై ఇద్దరు పిల్లలలో ఆధ్య పవన్ కు కుడి భుజంపై కునుకు తీయగా అఖిరా పవన్ గుండెలపై పడుకున్నాడు. పవన్ అఖిరాను ముద్దు పెట్టుకుంటుండగా ఉన్న అందమైన ఫోటోను తానే బ్లాక్ అండ్ వైట్ లో తీసినట్టుగా రేణు తెలిపి ఆ అద్భుతమైన మూమెంట్ ను తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలిపారు. దీనితో ఈ ఫోటోను చూసిన పవన్ అభిమానులు మరింత ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

https://www.instagram.com/p/CISTiP4BqrL/?utm_source=ig_web_copy_link

సంబంధిత సమాచారం

తాజా వార్తలు