‘టైగర్ నాగేశ్వరరావు’ టీమ్ కి ధన్యవాదాలు – రేణు దేశాయ్

‘టైగర్ నాగేశ్వరరావు’ టీమ్ కి ధన్యవాదాలు – రేణు దేశాయ్

Published on Jan 30, 2023 9:30 PM IST

మాస్ మ‌హారాజ్ ర‌వితేజ హీరోగా టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ రాబోతుంది. ఇండియన్ రాబిన్ హుడ్ గా పేరుగాంచిన స్టువర్ట్‌ పురానికి చెందిన వ్యక్తినే ఈ ‘టైగర్ నాగేశ్వరరావు’. ఐతే, ఈ సినిమాలో రేణు దేశాయ్‌ చాలా కాలం తర్వాత కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. హేమలత లవణం అనే పాత్రలో రేణు దేశాయ్‌ నటిస్తోంది. కాగా తన పోర్షన్ షూటింగ్ కంప్లీట్ చేసింది రేణు. తాజాగా ఇన్‌స్టా స్టోరీస్‌లో ఒక పోస్ట్ పెడుతూ…సెట్‌లో తనను అందరూ ఒక ఫ్యామిలీ మెంబర్ లా ప్రతిరోజు కంఫర్టబుల్‌గా చూసుకున్నందుకు మూవీ టీమ్‌ మొత్తానికి ధన్యవాదాలు తెలిపింది‌ రేణు దేశాయ్.

ఇక సినిమాలో టైగర్ నాగేశ్వరరావుగా రవితేజ కి స్ఫూర్తిని రగిలించే పాత్రలోనే రేణు దేశాయ్‌ కనిపించబోతుందట. మొత్తానికి దాదాపు 18 ఏళ్ల విరామం తర్వాత రేణు దేశాయ్ స్ఫూర్తిదాయకమైన పాత్రతో తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఈ చిత్రం రవితేజ కెరీర్‌లోనే ప్యాన్‌ ఇండియా సినిమాగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. పైగా దర్శకుడు వంశీ ఈ సినిమాని ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు