దిశ ఘటన వివరాల కోసం ఏసీపీని కలిసిన వర్మ

దిశ ఘటన వివరాల కోసం ఏసీపీని కలిసిన వర్మ

Published on Feb 18, 2020 8:40 PM IST

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈమధ్య సినిమాల కోసం వాస్తవ ఘటనల్ని, వ్యక్యుల్ని ఎక్కువగా ఎంచుకుంటున్నారు. ఏదైనా విషయాన్ని వర్మ లోతుగా రీసెర్చ్ చేసి అందులో ప్రజలకు తెలియని కోణాల్ని తనదైన రీతిలో ప్రెజెంట్ చేసే ప్రయత్నం చేస్తుంటారు. ప్రస్తుతం ఆయన కొన్ని నెలల క్రితం హైదరాబాద్ శివార్లలో జరిగిన దిశా ఉదంతం మీద సినిమా చేసే ప్రయత్నంలో ఉన్నారు.

జనాలకు తెలిసిన వివరాలు మాత్రమే కాకుండా నేరం జరిగిన తీరును, నేరస్థుల ఆలోచనా విధానాన్ని మరింత స్పష్టంగా తెరపై ఆవిష్కరించడానికి వర్మ రాజీవ్ గాంధీ విమానాశ్రయ పోలీస్ స్టేషన్ కు వెళ్ళి అక్కడ ఏసీపీని కలిసి డీటైల్స్ తెలుసుకున్నారట. ఇందులో పోలీస్ ఎన్ కౌంటర్, నేరస్థుల మరణం, బాధితురాలు, నేరస్థుల కుటుంబాలు వంటి అంశాలు కూడా ఉంటాయట. సో.. మరోసారి వర్మ తన రియలిస్టిక్ అప్రోచ్ ఎలా ఉంటుందో చూపబోతున్నారన్నమాట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు