యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ మరియు నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరో హీరోయిన్లుగా ప్రముఖ దర్శకుడు తిరుమల కిషోర్ దర్శకత్వంలో రూపొందుతున్న లేటెస్ట్ చిత్రం “ఆడవాళ్ళు మీకు జోహార్లు”. ఎస్ ఎల్ వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది హీరో శర్వానంద్, హీరోయిన్ రష్మిక మందన్న, దర్శకుడు కిషోర్ తిరుమల కాంబినేషన్లో రూపొందుతోన్న ఫస్ట్ మూవీ కావడం విశేషం.
మరి మొన్ననే ఈ చిత్రం తాలూకా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే.. హీరో శర్వానంద్, హీరోయిన్ రష్మిక మందన్న సహా ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు దర్శకుడు కిషోర్ తిరుమల. మరి ఇప్పుడు ఈ సినిమా మేకర్స్ఈ ఈ చిత్రానికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నట్టుగా ఈ రోజు అధికారికంగా చిత్ర యూనిట్ ప్రకటించారు.
ఈ సినిమాలో శర్వానంద్, రష్మిక మందన్న క్యారెక్టర్లు ఆసక్తికరంగా ఉండనున్నాయని, కిశోర్ తిరుమల మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమాను తెరకెక్కిన్నారని. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం మంచి అసెట్ కానుంది అని చిత్ర యూనిట్ తెలిపింది.జాతీయ అవార్డులు సాధించిన శ్రీకర్ ప్రసాద్ ఎడింటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ సినిమాకు సుజిత్ సారంగ్ సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు.
ఇక ఈ చిత్రంలో శర్వానంద్, రష్మికా మందన్నా, సహా ‘వెన్నెల’ కిశోర్, రవి శంకర్, సత్య, ప్రదీప్ రావత్, గోపరాజు, బెనర్జీ, కల్యాణీ, నటరాజన్, రాజశ్రీ నాయర్, ఝాన్సీ, రజిత, సత్యకృష్ణ, ఆర్సీఎమ్ రాజు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.