భారీ యాక్షన్ సీక్వెన్స్‌ పూర్తి చేసిన రాజమౌళి !

భారీ యాక్షన్ సీక్వెన్స్‌ పూర్తి చేసిన రాజమౌళి !

Published on Nov 30, 2020 2:20 PM IST

ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా చేస్తోన్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ నుండి లేటెస్ట్ అప్ డేట్ ను రివీల్ చేసింది చిత్రబృందం. 50 రోజుల మేజర్ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ ను పూర్తి చేసి.. వెంటనే కొత్త షెడ్యూల్ కోసం చిత్రబృందం సన్నద్ధమవుతున్నట్లు మేకర్స్ సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చారు.

కాగా చారిత్రక నేపథ్యంతో తెరకెక్కుతున్న సినిమా కావడంతో రాజమౌళి ఈ సినిమా కోసం ప్రపంచస్థాయి నటీనటుల్ని తీసుకున్నాడు. సినిమాలోనే ప్రధాన పాత్ర కోసం ఐరిష్ నటి అలిసన్ డూడీని తీసుకున్నారు. ఇక ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ నేపథ్య సంగీతం పై కీరవాణి వర్క్ చేస్తున్నాడట. ఇప్పటివరకూ షూటింగ్ పూర్తి చేసుకున్న సీన్స్ కు సంబందించి ఇప్పటికే మెయిన్ బిజియమ్ ను పూర్తి చేశాడట.

ఇక రాజమౌళి ముందుగానే ప్రకటించినట్లుగా ‘ఆర్ఆర్ఆర్’ క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీపడకుండా తెరకెక్కుతుంది. కాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం, చరణ్ అల్లూరి పాత్రల్లో కనిపించబోతున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై ఈ సినిమాని దానయ్య నిర్మిస్తున్నారు. కాగా ‘బాహుబలి’ తరవాత జక్కన్న చేస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రం పై ఆరంభం నుండి భారీ అంచనాలు భారతీయ అన్ని సినీ పరిశ్రమల్లో నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు