ఓటిటి లోకి వచ్చేసిన “రూల్స్ రంజన్”

ఓటిటి లోకి వచ్చేసిన “రూల్స్ రంజన్”

Published on Nov 30, 2023 8:54 PM IST

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా, నేహా శెట్టి హీరోయిన్ గా దర్శకుడు రతినం కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రూల్స్ రంజన్. ఈ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకోవడం లో విఫలం అయ్యింది. ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్ గా మరోసారి ఆడియెన్స్ ముందుకి వచ్చేసింది. ఈ చిత్రం కి సంబందించిన డిజిటల్ హక్కులని తెలుగు ఓటిటి ప్లాట్ ఫామ్ అయిన ఆహా వీడియో సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.

అయితే అనౌన్స్ చేసిన టైమ్ కి సినిమాను స్ట్రీమింగ్ కి తీసుకు వచ్చింది ఆహా వీడియో. చిత్రానికి అమ్రిష్ సంగీతం అందించగా, స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు. ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్ గా ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు