ఆగస్టు 15న విడుదల కావల్సివున్న “సాహో” ను అనూహ్యంగా వాయిదావేస్తూ చిత్ర యూనిట్ చేసిన ప్రకటన అభిమానులను,సినీ ప్రేమికులను ఒకింత నిరాశకు గురిచేసింది. ముఖ్యంగా ప్రభాస్ అభిమానులకు ఈ వార్త పిడుగుపాటులా మారింది. కారణం గత ఆరేళ్లలో ప్రభాస్ చేసింది రెండు చిత్రాలు మాత్రమే. 2013లో ‘మిర్చి’ విడుదల తరువాత రెండేళ్లకు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి-ది బిగినింగ్’ 2015లో విడుదల అయ్యింది. దీనికి కొనసాగింపుగా తెరకెక్కిన ‘బాహుబలి-కంక్లూషన్’ కూడా మరో రెండేళ్లకు 2017లో విడుదల చేశారు.
‘బాహుబలి’ తరువాతైనా ప్రభాస్ చకచకా సినిమాలు చేస్తాడనుకుంటే ప్రభాస్ ‘సాహో ‘లాంటి మరో పెద్ద ప్రాజెక్ట్ ఒప్పుకొని మరో రెండేళ్లు ఆ చిత్రానికి కేటాయించారు. ఎట్టకేలకు ఆగస్టు 15న ప్రభాస్ ని సినిమా తెరపై చూద్దామన్న అభిమానుల ఆశలు మూవీ విడుదల వాయిదా నిర్ణయంతో అడియాసలయ్యాయి.
ఎట్టకేలకు సాహో విడుదలపై ఉత్కంఠకు,ఊహాగానాలకు తెరదించుతూ చిత్ర నిర్మాతలు విడుదల తేదీ ప్రకటిస్తూ ట్విట్టర్ వేదికగా ఓ ప్రకటన విడుదల చేశారు. సాహో ని ఆగస్టు 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు తెలియపరిచారు. ఈ ప్రకటన ప్రభాస్ అభిమానులకు పండగ లాంటి వార్తే అని చెప్పాలి. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ లో ప్రభాస్ సరసన శ్రద్దా కపూర్ నటిస్తుండగా,జాకీ ష్రాఫ్,నీల్ నితిన్ ముఖేష్,మురళి శర్మ,వెన్నెల కిషోర్ కీలక పాత్రలు చేస్తున్నారు.
No compromise on the content and quality!
The action begins in cinemas from 30th Aug. #Saaho releasing worldwide on 30.08.2019.#Prabhas @ShraddhaKapoor @NeilNMukesh @arunvijayno1 @sujeethsign @UV_Creations @itsBhushanKumar @TSeries #30thAugWithSaaho pic.twitter.com/Clne9tuiVS— UV Creations (@UV_Creations) July 19, 2019