ప్రభాస్ హీరోగా అత్యంత భారీ బడ్జెట్ తో హై స్టాండర్డ్స్ టెక్నాలజీతో తెరెకెక్కుతున్న చిత్రం ‘సాహో’. అగష్టు 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. కాగా ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతుంది. తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అగష్టు 15న భారతదేశ స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా సాహో ట్రైలర్ ను విడుదల చేయన్నారు.
కాగా వచ్చే నెల రెండో వారం కల్లా పోస్ట్ ప్రొడక్షన్ కి సంబధించిన మొత్తం వర్క్ పూర్తవుతుందట. ఆలాగే ప్రమోషన్స్ ను కూడా అన్ని భాషల్లో పెద్ద ఎత్తున చేయనున్నారు. ఇక ఆస్ట్రియాలోని అందమైన లోకేషన్స్ లో చిత్రీకరించిన సాంగ్స్ కూడా చాల బాగా వచ్చాయట. టాలెంటెడ్ మ్యూజిక్ కంపోజర్ జిబ్రాన్ ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
మొత్తానికి జిబ్రాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సాహోకి ప్రత్యేకంగా నిలవనుందట. ఈ చిత్రాన్ని మూడు భాషల్లో భారీ బడ్జెట్ తో టాలీవుడ్ ప్రేస్టేజియస్ ప్రోడక్షన్ హౌస్ యువి క్రియెషన్స్ బ్యానర్ లో వంశి, ప్రమెద్, విక్రమ్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.