ఫ్యాన్స్ కి ‘సాహో’ నిర్మాతల సర్ప్రైజ్ గిఫ్ట్

ఫ్యాన్స్ కి ‘సాహో’ నిర్మాతల సర్ప్రైజ్ గిఫ్ట్

Published on Jul 31, 2019 4:43 PM IST

“సాహో” హై వోల్టాగే యాక్షన్ ని ఎంజాయ్ చేయడానికి కేవలం ఇంకా ముప్పై రోజులే మిగిలివుంది. అభిమానుల నిరీక్షణకు కొంచెం ఉపశమనంగా ‘సాహో’ టీం సాంగ్స్, టీజర్స్ విడుదల చేస్తున్నారు. 2013లో విడుదలైన ‘మిర్చి’ మూవీ తరువాత ఈ ఆరేళ్లలో ప్రభాస్ వెండితెరపై కనిపించింది రెండుసార్లు మాత్రమే. ‘బాహుబలి 2’ విడుదలై ఇప్పటికే రెండేళ్లు దాటిపోతుంది. ఇన్నేళ్ల నిరీక్షణకు తెరదించుతూ ‘సాహో’ మూవీ ఆగస్టు 30న భారీ ఎత్తున విడుదల కానుంది.

ఐతే ‘సాహో’ నిర్మాతలు అయిన యూవీ క్రియేషన్స్ ,మూవీకి ముందే అభిమానుల కొరకు ఓ సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. ‘సాహో ది గేమ్’ పేరుతో ఓ వీడియో గేమ్ ని విడుదల చేస్తున్నట్లుగా కొద్దిసేపటిక్రితం తెలియజేశారు. ఈ గేమ్ ని ప్రఖ్యాత గేమ్ డెవలపింగ్ సంస్థ ఫిక్స లాట్ ల్యాబ్స్ డెవలప్ చేయడం జరిగింది. మరి ఈ గేమ్ ఎప్పటినుండి అందుబాటులోకి రానుందన్న విషయాలు తెలియాల్సివుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు