ప్రస్తుతం మన సౌత్ ఇండియా సినిమా దగ్గర భారీ క్రేజ్ ని సొంతం చేసుకుని లేడీ పవర్ స్టార్ గా మారిన హీరోయిన్ ఎవరన్నా ఉన్నారు అంటే అది నాచురల్ నటి సాయి పల్లవి అని చెప్పాలి. అయితే సాయి పల్లవి నటించిన రీసెంట్ హార్డ్ హిట్టింగ్ సినిమా “గార్గి” గత ఏడాది రిలీజ్ అయ్యి మంచి హిట్ అయ్యి విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
అలాగే అందులో సాయి పల్లవి నటనకి కూడా ప్రత్యేక అప్లాజ్ దక్కగా లేటెస్ట్ గా అయితే సాయి పల్లవికి బెస్ట్ యాక్ట్రెస్ గా ముంబై లో జరిగిన క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్ లో ఆమెకి దక్కింది. అయితే ఈ ఈవెంట్ కి హాజరైన ఈ నాచురల్ బ్యూటీ తాలూకా ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. రెడ్ సారీ లో సాయి పల్లవి చాలా ఎలెగంట్ గా కనిపిస్తుండగా ఇప్పుడు ఆ ఫొటోలతో పాటుగా ఆమె పేరు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.
Our Queen @Sai_Pallavi92 today
at Mumbai ????????#SaiPallavi pic.twitter.com/D8DKRaRrOb— Sai Pallavi FC™ (@SaipallaviFC) March 27, 2023