టీవీ ప్రీమియర్ కి రెడీ అయిన “సైంధవ్”

టీవీ ప్రీమియర్ కి రెడీ అయిన “సైంధవ్”

Published on Mar 6, 2024 3:01 AM IST

టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ సైంధవ్. ఈ చిత్రం ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా థియేటర్ల లో రిలీజ్ అయ్యింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టడం లో విఫలం అయ్యింది. ఇప్పుడు ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయిపోయింది.

ప్రముఖ టీవీ ఛానల్ అయిన ఈటీవీ ఈ సినిమా యొక్క శాటిలైట్ హక్కులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఆదివారం సాయంత్రం 6:00 గంటలకు ఈటీవీ లో సైంధవ్ ప్రసారం కానుంది. రుహని శర్మ, శ్రద్దా శ్రీనాథ్, ఆండ్రియా జెరేమియా, నవాజుద్దీన్ సిద్ధిఖీ లు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. ఈ చిత్రం బుల్లితెర పై ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు