ఫస్ట్ లుక్ తో రానున్న మహేష్ బాబు ?

ఫస్ట్ లుక్ తో రానున్న మహేష్ బాబు ?

Published on Aug 4, 2019 11:14 AM IST

సూపర్ స్టార్ మహేశ్ బాబు టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తోన్న ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌ లో శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా నిర్మించిన రైలు తాలూకు సెట్‌ లో ఈ సినిమాలోని కీలకమైన రైలు సీక్వెన్స్ ను తెరకెక్కిస్తున్నారు. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఆగస్టు 9న ఈ సినిమాలోని మహేష్ బాబు ఫస్ట్ లుక్ కి సంబంధిచిన పోస్టర్ ను విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు ఎలా కనిపించబోతున్నారో అని ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కాగా ప్రస్తుతం జరుగుతున్న ఈ షెడ్యూల్ లో మహేష్ తో పాటు రాజేంద్ర ప్రసాద్ అలాగే కొంతమంది ముఖ్య తారాగణం కూడా పాల్గొంటున్నారు. సినిమాలో మహేశ్ సరసన రష్మిక మండన్నా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఒక్కప్పటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది.

మహేష్ అజయ్ కృష్ణ అనే ఆర్మీ మేజర్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు తో కలిసి అనిల్ సుంకర నిర్మించనున్నారు. ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు