‘రణరంగం’ నుండి ‘పిల్ల పిక్చర్ పర్ఫెక్ట్’ !

‘రణరంగం’ నుండి ‘పిల్ల పిక్చర్ పర్ఫెక్ట్’ !

Published on Jul 30, 2019 1:01 AM IST

యువ కథానాయకుడు శర్వానంద్, కాజల్, కళ్యాణి ప్రియదర్శి ని ల కాంబినేషన్ లో ప్రముఖ దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో, ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం ‘రణరంగం’ ఆగస్టు 15 న విడుదల కానున్న విషయం విదితమే. ఈ చిత్రానికి సంబంధించిన మూడవ గీతాన్ని ఈ రోజు విడుదల చేశారు. ‘పిల్ల పిక్చర్ పర్ఫెక్ట్’ అనే పల్లవి గల ఈ గీతాన్ని గీత రచయిత కృష్ణ చైతన్య రచించగా, సంగీత దర్శకుడు సన్నీ ఎం.ఆర్. సమకూర్చిన స్వరాలు అలరిస్తాయి. కథానాయకుడు శర్వానంద్, కాజల్ అగర్వాల్ లపై ఈ గీతాన్ని చిత్రీకరించారు.

కధా పరంగా శర్వానంద్, కాజల్ అగర్వాల్ ల మధ్య చిత్రీకరించిన ఈ పాట క్లాస్,మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. గాయని నిఖిత గాంధీ గళం ఈ పాటకు మరింత కొత్త దనాన్ని అందించింది. ఆదిత్య మ్యూజిక్ కంపెనీ ద్వారా ఈ చిత్రం ఆడియో విడుదల అవుతుంది. చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్నాయి. ఈ చిత్రాన్ని ఆగస్టు 15 , 2019 న విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపారు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు