ఆన్ స్క్రీన్ ఇమేజ్ తో ప్రయోగాలు చేస్తున్న శ్రియ

ఆన్ స్క్రీన్ ఇమేజ్ తో ప్రయోగాలు చేస్తున్న శ్రియ

Published on Mar 10, 2013 3:10 PM IST

Shriya-Saran

తెలుగులో గ్లామర్ డాల్ గా పేరు తెచ్చుకున్న శ్రియ ఇప్పుడు ఆ కెరీర్ ని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తోంది. చెన్నకేశవ రెడ్డి మూవీ నుంచి ఇప్పుడు అడపాదడపా చేస్తున్న స్పెషల్ సాంగ్స్ వరకూ ఎన్నో రకాల పాత్రలు చేసి తన ఒంపు సొంపులతో, డాన్సులతో ఆకట్టుకున్న శ్రియ గత కొన్ని సంవత్సరాలుగా రూటు మార్చి నటనకి ఆస్కారమున్నవి, సినిమాలోని కీలక పాత్రలను పోషిస్తోంది. గత సంవత్సరం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమాలో రిచ్ గర్ల్ గా కనిపించి తన ప్రక్క కాలనీలో ఉండే ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిని ఇష్టపడే అమ్మాయిగా కనిపించింది.

ప్రస్తుతం రూప అయ్యర్ దర్శకత్వంలో రానున్న ‘చంద్ర’ సినిమాలో సాధారణ జీవితాన్ని గడపాలనుకునే ఒక యువరాణిలా కనిపించనుంది. ఇది కాకుండా జనార్ధన మహర్షి దర్శకత్వంలో రానున్న ‘పవిత్ర’ సినిమాలో మహిళల న్యాయం కోసం పోరాడే ఒక పొలిటీషియన్ పాత్రలో కనిపించనుంది. ఇవి రెండు సినిమాలు కాకుండా తాజా సమాచారం ప్రకారం టాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ లో నటించే అవకాశం కొట్టేసింది. విక్రం కుమార్ దర్శకత్వంలో ఎ.ఎన్.ఆర్, నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించనున్న మల్టీ స్టారర్ చిత్రం ‘మనం’. ఈ సినిమాలో నాగార్జునకి జోడీగా శ్రియ నటించనుంది.

నాగార్జున – శ్రియ కలిసి ఇప్పటికే ‘సంతోషం’, ‘నేనున్నాను’, ‘బాస్’ సినిమాల్లో నటించారు. ఇప్పుడు తను చేయనున్న ‘మనం’ సినిమా కూడా ఫ్యామిలీ డ్రామా కావడంతో ఖచ్చితంగా ఇందులో కూడా అమెది డిఫరెంట్ రోల్ అయ్యే అవకాశం ఉంది. 2000 సంవత్సరం, ఆ తర్వాత టైములో స్టార్డం ఎంజాయ్ చేసిన శ్రియ ప్రస్తుతానికి తగ్గట్టు మారి తన స్టార్ ఇమేజ్ ను వాడుకొని కొత్త రకమైన పాత్రలకి, ప్రయోగాత్మక సినిమాలతో తెరపైకి వస్తోంది. ఇలాంటి మార్పుకు స్వాగతం చెప్పాల్సిందే..

సంబంధిత సమాచారం

తాజా వార్తలు