పౌరాణిక పాట పాడుకోబోతున్న ఎన్.టి.ఆర్, త్రిష

పౌరాణిక పాట పాడుకోబోతున్న ఎన్.టి.ఆర్, త్రిష

Published on Jan 7, 2012 2:30 PM IST


యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ నటిస్తున్న యాక్షన్ ఎంటర్ టైనేర్ “దమ్ము” సినిమా అభిమానులను మరియు ఎన్.టి.ఆర్ అభిమానులను అలరించడానికి సిద్దమవుతుంది. ఈ చిత్రం లో ఎన్.టి.ఆర్ నృత్యాలను,పోరాటాలను,డైలాగు ల ను పూర్తి గా చూడవచ్చు. దర్శకుడు బోయపాటి శ్రీను ఈ చిత్ర విజయం కోసం చిన్న విషయాన్నీ కూడా వదలట్లేదు. ఈ చిత్రం లో ఒక పౌరాణిక పాట ఉండబోతున్నది అని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. పౌరాణిక దుస్తులలో ఎన్.టి.ఆర్. మరియు త్రిష ల ను చూడవచ్చు. కీరవాణి స్వరపరచిన పాటలు అద్బుతంగా ఉన్నాయని రాజమౌళి గతం లో నే చెప్పారు.కార్తీక రెండవ కథానాయికగా చేస్తున్నారు. అలెగ్జాండర్ వల్లభ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా క్రియేటివ్ కమర్షియల్స్ పతాకం పై కే.ఎస్.రామా రావు సమర్పిస్తున్నారు. ఈ చిత్రం 2012 వేసవి లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు