ఇమేజ్ ని వ్యాపారానికి వాడేస్తున్నారుగా…!

ఇమేజ్ ని వ్యాపారానికి వాడేస్తున్నారుగా…!

Published on Jul 31, 2019 7:14 AM IST

హీరోలు వ్యాపారాలు చేయడం కొత్తేమి కాదు. ఐతే నేటి తరం స్టార్ హీరోలు వరుసగా బట్టల వ్యాపారంలోకి దిగుతూ కొత్త ట్రెండ్ కి నాందిపలుకుతున్నారు. మొన్న విజయ్ దేవరకొండ, నిన్న ఛార్మి కౌర్, నేడు మహేష్, రేపు అల్లు అర్జున్ లు గార్మెంట్స్ బ్రాండ్స్ మొదలుపెట్టారు.

నిజానికి ఈ ట్రెండ్ ని బాలీవుడ్ లో సల్మాన్ మొదలుపెట్టారు. ‘బీయింగ్ హ్యూమన్’ పేరుతో ఆయన స్టార్ట్ చేసిన బ్రాండ్ సూపర్ సక్సెస్ అయ్యింది. టాలీవుడ్ క్రేజీ యంగ్ హీరో విజయ్ దేవరకొండ మరో ప్రాంచైజ్ తో కలిసి ‘రౌడీ’ పేరుతో ఓ గార్మెంట్ బ్రాండ్ ని నడుపుతున్నాడు. ప్రెసెంట్ విజయ్ కి యూత్లో ఉన్న పాపులారీ దృష్ట్యా ఈ బ్రాండ్ బాగానే సాగుతుంది. అలాగే వేదికలపై విజయ్ ఈ బ్రాండ్ బట్టలు ధరించి వాటికి ప్రచారం కల్పిస్తూ ఉంటాడు.పూరితో కలిసి నిర్మాత గా మారిన ఛార్మి సైతం హీరో రామ్, పూరి ల ఇమేజ్ వేల్యూ తో ‘బి ఇస్మార్ట్’ పేరుతో ఓ ఆన్లైన్ గార్మెంట్స్ స్టోర్ స్టార్ట్ చేశారు.

ఇక సూపర్ స్టార్ మహేష్ రెండు రోజుల క్రితం ‘ది హుంబుల్ కో ‘ బ్రాండ్ నేమ్ తో అప్పెరల్స్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించేశారు. ఆగస్టు 7న ఘనంగా ఈ బ్రాండ్ ప్రారంభం కానుంది. ఇక తాజాగా మరో స్టార్ హీరో అల్లు అర్జున్ కూడా ఓ గార్మెంట్ బ్రాండ్ వ్యాపారం మొదలుపెట్టనున్నారని సమాచారం.ఇలా స్టార్ హీరో లు ప్రజల్లో తమకు ఉన్న ఆదరణను తెలివిగా వ్యాపారం కొరకు ఉపయోగించుకుంటున్నారు. హీరో కొరకు ఏమైనా చేసే అభిమానులున్న నేపథ్యంలో ఆ స్టార్స్ కి చెందిన ప్రొడక్ట్స్ ఎగబడి కొంటారనడంలో సందేహం లేదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు