వెంకీ, రానాల మల్టి స్టారర్ ఉంటుంది -సురేష్ బాబు !

వెంకీ, రానాల మల్టి స్టారర్ ఉంటుంది -సురేష్ బాబు !

Published on Jun 23, 2018 12:01 AM IST

వెంకటేష్ , రానాలు కలిసి మల్టి స్టారర్ సినిమాలో నటించనున్నారని గతంలో వార్తలు వచ్చాయి అయితే ఆ తరువాత ఈ వార్తలపై ఎవరు స్పందిచక పోవడంతో ఈ వార్తలను కొట్టిపారేసారు . కానీ ఇప్పుడు స్వయంగా ప్రముఖ నిర్మాత సురేష్ బాబే తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఈ విషయం ఫై స్పందించారు
వెంకీ ,రానాలతో మల్టి స్టారర్ చిత్రం ఉంటుందని ఈ సందర్బంగా ఆయన వివరించారు.

ప్రస్తుతం వెంకీ రానా లు వరుస సినిమాలతో బిజీ గా వున్నారు . వీరిద్దరి కలయికలో తెరెకెక్కనున్న ఈ మల్టి స్టారర్ 2019లో ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి . ఈ చిత్రానికి ఇంకా దర్శకుడిని ఫిక్స్ చేయలేదు .

ఇక సురేష్ బాబు తన కొత్త సినిమా ఈ నగరానికి ఏమైంది చిత్ర ప్రమోషన్స్ లో బిజీ గా వున్నారు ఆయన నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు