ఆ ‘బయోపిక్’లో ఇంకా హీరోయిన్ ఫైనల్ కాలేదట ?

ఆ ‘బయోపిక్’లో ఇంకా హీరోయిన్ ఫైనల్ కాలేదట ?

Published on Mar 24, 2019 11:55 PM IST

‘దొంగాట, కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ చిత్రాల దర్శకుడు వంశీకృష్ణ దర్శకత్వంలో ‘టైగర్ నాగేశ్వర్ రావు’ బయోపిక్ లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తోన్న విషయం తెలిసిందే. అయితే ఈ బయోపిక్ లో సెన్సేషన్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ను హీరోయిన్ గా తీసుకున్నారని గతంలోనే వార్తలు వచ్చాయి. తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం ఇంకా ఈ సినిమాలో హీరోయిన్ ఫైనల్ కాలేదు అంటా. ప్రస్తుతం హీరోయిన్ని ఫైనల్ చేసే పనిలో ఉంది చిత్రబృందం. ఓ స్టార్ హీరోయిన్ తో సంప్రదింపులు జరుపుతున్నారట.

ఇక ‘టైగర్ నాగేశ్వర్రావు’ గురించి ఇప్పటి తరానికి పెద్దగా తెలియకపోవచ్చు గాని, 1980-90 దశకాల్లో స్టూవర్టుపురం గజదొంగగా టైగర్ నాగేశ్వర్ రావు ఒక భయానక వాతావరణాన్నే సృష్టించారు. మరి అలాంటి బయోపిక్ అంటే అప్పటి విషయాలు బాగానే ఇంట్రస్టింగ్ గా ఉంటాయి. ఈ చిత్రానికి ప్రముఖ మాటల రచయిత సాయిమాధవ్ బుర్రా మాటలు రాస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు