కేయస్ పి ప్రొడక్షన్స్ పతాకంపై డా.యలమంచిలి ప్రవీణ్ సమర్పణలో అరుణ్ తేజ్ , చరిష్మా శ్రీకర్ జంటగా బియన్ రెడ్డి అభినయ దర్శకత్వంలో డా.యలమంచిలి ప్రవీణ్, డా.ఏయస్ కీర్తి, డా.జి.పార్థ సారధి రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం నీతోనే హాయ్ హాయ్. ఈ చిత్రం ఆడియో ఇటీవల తిరుపతిలో నటుడు 30 ఇయర్స్ పృథ్వి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్వీబిసి చైర్మైన్ అయిన తర్వాత నేను హాజరైన మొదటి ఆడియో ఫంక్షన్ ‘నీతోనే హాయ్ హాయ్’. ఇందులో ఐదు పాటలు చాలా బావున్నాయి. ముగ్గురు నిర్మాతలు మంచి అభిరుచితో చిత్రాన్ని నిర్మించారు. హీరో, హీరోయిన్స్ మంచి నటన కనబరిచారు. ట్రైలర్ చూస్తుంటే దర్శకుడి ప్రతిభ ఏంటో తెలుస్తుంది. కంటెంట్ బావుంటే కొత్త, పాత లేకుండా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఈ సినిమా కూడా విజయవంతం కావాలని కోరుకుంటూ యూనిట్ అందరికీ నా శుభాకాంక్షలు అన్నారు.
నిర్మాత డా.పార్థసారధి రెడ్డి మాట్లాడుతూ…ఎన్నో వ్యయ ప్రయాలసకోర్చి సినిమా చేశాం. మా తొలి ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నా అన్నారు.
డా.ఏయస్ కీర్తి మాట్లాడుతూ…ఇటీవల కాలం లో డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న సినిమాలను ఆదరిస్తున్నారు. అలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తోన్న మా సినిమాను కూడా ప్రేక్షకులు సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నా అన్నారు. మరో నిర్మాత , సమర్పకులు డా. యలమంచిలి ప్రవీణ్ మాట్లాడుతూ…ఎంతో పాషన్ తో ఈ సినిమా చేశాం. అంతే పాషన్ తో ఉన్న దర్శకుడు ఎక్కడా రాజీ పడకుండా సినిమా చేశారు. గ్రాండ్ గా సినిమాను ఈ నెల 23 న రిలీజ్ చేస్తున్నాం అన్నారు.