‘దర్శకరత్న’కి నిజమైన నివాళి ఇది !!

‘దర్శకరత్న’కి నిజమైన నివాళి ఇది !!

Published on May 6, 2019 7:28 PM IST

దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు ఆశయాలకు కొనసాగింపుగా.. కొత్త ప్రతిభను పరిశ్రమకు పరిచయం చేయాలనే లక్ష్యంతో ఏర్పాటైన ‘దాసరి టాలెంట్ అకాడమీ’ 2019 సంవత్సరానికిగాను షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ ప్రకటించడం తెలిసిందే. ఈ కాంటెస్ట్ లో గెలుపొందిన విజేతలకు బహుమతీ ప్రదానోత్సవం హైదరాబాద్ లోని ప్రసాద్ లాబ్స్ లో అత్యంత ఘనంగా నిర్వహించారు. ప్రముఖ నటులు డాక్టర్ మోహన్ బాబు, సహజనటి జయసుధ, సాక్షి ఎడిటోరియల్ అడ్వైజర్ కె.శ్రీరామచంద్రమూర్తి, తమ్మారెడ్డి భరద్వాజ, ఆర్.నారాయణమూర్తి, సి.కళ్యాణ్ ఈ బహుమతులను అందించారు.

కాంటెస్ట్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ‘ప్రార్టిసిపేటరీ సర్టిఫికెట్స్’ ఇచ్చారు. ఇదే వేదికపై ఆరుగురు పేద విద్యార్థినీవిద్యార్థులకు నగదు సహాయం అందించారు. దాసరి ఆశయాలకు కొనసాగింపుగా దాసరి టాలెంట్ అకాడమీ స్థాపించి.. షార్ట్ ఫిలిం కాంటెస్ట్ కు శ్రీకారం చుట్టిన దాసరి టాలెంట్ అకాడమీ వ్యవస్థాపకులు బి.ఎస్.ఎన్.సూర్యనారాయణను మోహన్ బాబు, జయసుధతోపాటు ఇతర అతిధులందరూ అభినందించారు. దాసరికి పద్మవిభూషణ్ వచ్చేలా రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కృషి చేయాలని ఆర్.నారాయణమూర్తి పేర్కొన్నారు.

మానవ సంబంధాలు, మానవీయ విలువల నేపథ్యంలో రూపొందిన షార్ట్ ఫిల్మ్స్ నుంచి విజేతలను ఎంపిక చేశారు. ప్రధమ బహుమతిగా ‘పసుపు-కుంకుమ’కు లక్ష రూపాయలు, రెండో బహుమతి ‘మాతృదేవోభవ’కి 50 వేలు, మూడవ బహుమతి ‘తాతా మనవడు’కి 25 వేలుతో పాటు..
మొదటి జ్యూరీ అవార్డు 25 వేలు, రెండవ జ్యూరీ 15.000/-, ఉత్తమ దర్శకుడు 20.000/-, ఉత్తమ కథా రచయిత 10.000/-, ఉత్తమ నటుడు 10,000/-, ఉత్తమ నటి 10.000/- చొప్పున నగదు బహుమతులు ‘నీహార్ ఈ సెంటర్’ లాంపెక్స్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, శాంసంగ్ సౌజన్యంతో అందజేశారు!!

సంబంధిత సమాచారం

తాజా వార్తలు