‘టిల్లు స్క్వేర్’ కూడా గురి తప్పదు – నిర్మాత నాగవంశీ

‘టిల్లు స్క్వేర్’ కూడా గురి తప్పదు – నిర్మాత నాగవంశీ

Published on Mar 19, 2024 3:00 AM IST

యువ నటుడు సిద్దు జొన్నలగడ్డ హీరోగా మల్లిక్ రామ్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ కామెడీ యాక్షన్ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ మూవీ టిల్లు స్క్వేర్. కోనేళ్ళ క్రితం రిలీజ్ అయి మంచి విజయం అందుకున్న డీజే టిల్లు కి సీక్వెల్ గా రూపొందుతున్న ఈ మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన రెండు సాంగ్స్, ట్రైలర్ అందరినీ ఆకట్టుకుని మంచి అంచనాలు ఏర్పరిచాయి. విషయం ఏమిటంటే, తాజాగా ఈ మూవీ నుండి ఓ మై లిల్లీ అనే పల్లవితో సాగె సాంగ్ ని ఒక ఈవెంట్ లో భాగంగా రిలీజ్ చేసారు. ఈ సందర్భంగా నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ, డీజే టిల్లు మాదిరిగా టిల్లు స్క్వేర్ కూడా థియేటర్స్ లో ఆడియన్స్ ని తప్పక అలరిస్తుందని అన్నారు.

ఇక డీజే టిల్లు కి ఎక్కువగా యూత్ కనెక్ట్ అయ్యారని, అనంతరం దానికి ఓటిటి లో ఫ్యామిలీ ఆడియన్స్ నుండి కూడా బాగా రెస్పాన్స్ లభించిందని తెలిపారు. టిల్లు స్క్వేర్ కి కూడా అదే మాదిరిగా థియేటర్స్ లో అదిరిపోయే రెస్పాన్స్ వస్తుందని నమ్ముతున్నాం, ఈసారి ఫ్యామిలీ ఆడియన్స్ కూడా థియేటర్స్ లో ఎంజాయ్ చేసేలా ఈ మూవీ తెరకెక్కిందని తెలిపారు. రామ్ మిరియాల, అచ్చు రాజమణి సంగీతం అందిస్తున్న ఈమూవీలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుండగా మూవీని మార్చి 29న విడుదల చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు