వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా “వినరో భాగ్యము విష్ణుకథ”…ఎప్పుడంటే?

వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా “వినరో భాగ్యము విష్ణుకథ”…ఎప్పుడంటే?

Published on Jun 6, 2023 10:00 PM IST

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా, డైరెక్టర్ మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వం లో తెరకెక్కిన రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ వినరో భాగ్యము విష్ణుకథ. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంది. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, ఈ చిత్రం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతోంది.

స్టార్ మా లో ఈ చిత్రం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరించనుంది. వచ్చే ఆదివారం మధ్యాహ్నం 1:00 గంటలకు ప్రసారం కానుంది. కాశ్మీర పరదేశి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం లో మురళి శర్మ కీలక పాత్రలో నటించారు. జీఏ2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు