అక్కడ ముందే రాబోతున్న ముగ్గురు హీరోల మల్టీస్టారర్ !

అక్కడ ముందే రాబోతున్న ముగ్గురు హీరోల మల్టీస్టారర్ !

Published on Oct 10, 2018 8:34 AM IST

యువ హీరోలు నారా రోహిత్‌, శ్రీవిష్ణు, సుధీర్ బాబు, కలయికలో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ ‘వీర భోగ వసంత రాయలు’ చిత్రం. నూతన దర్శకుడు ఇంద్రసేన. ఆర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ శ్రీయ ముఖ్య పాత్రలో నటిస్తుండటం విశేషం. కాగా వైవిధ్యమైన కథ కథనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఎవరు ఊహించని విధంగా డిఫరెంట్ గా ఉంటుందట. అయితే ఈ చిత్రం యుఎస్ లో విడుదల తేదీ కంటే రెండు రోజుల ముందే అక్టోబరు 23న విడుదల అవ్వబోతుంది. ఫ్లైహై సినిమాస్ ఈ చిత్రాన్ని యుఎస్ లో రిలీజ్ చేస్తున్నారు.

కాగా క్రైమ్ డ్రామాగా థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకి మార్క్ కే రాబిన్ సంగీతం సమకూరుస్తుండగా, బాబా క్రియేష‌న్స్ ప‌తాకంపై, ఎంవికె రెడ్డి గారి సమర్పణలో అప్పారావు బెల్లాన నిర్మిస్తున్నారు. ఈ ప్రయోగాత్మకమైన చిత్రం తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తోందని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు