‘మహర్షి’లో హైలెట్ సన్నివేశాలు ఇవేనా !

‘మహర్షి’లో హైలెట్ సన్నివేశాలు ఇవేనా !

Published on Dec 8, 2018 2:14 PM IST

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ‘మహర్షి’ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. కాగా ప్రస్తుతం సినిమాలోని ప్రధాన తారాగణంతో దర్శకుడు వంశీ పైడిపల్లి పల్లెటూరు నేపథ్యంలో సాగే సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. సెకెండాఫ్ లో వచ్చే ఈ సన్నివేశాలు సినిమాకే హైలెట్ గా నిలుస్తాయట.

ఇక ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ప్రముఖ కామెడీ హీరో అల్లరి నరేష్ కూడా ఈ చిత్రంలో ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు. ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు , అశ్వినీదత్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం శాటిలైట్ హక్కులను ప్రముఖ టెలివిజన్ ఛానెల్ అయిన జెమినీ టీవీ దక్కించుకుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు