‘వినరో భాగ్యము విష్ణు కథ’ ఓటిటి స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

‘వినరో భాగ్యము విష్ణు కథ’ ఓటిటి స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

Published on Mar 15, 2023 11:08 PM IST

యువ నటుడు కిరణ్ అబ్బవరం హీరోగా కాశ్మీరా పర్దేశి హీరోయిన్ గా యువ దర్శకుడు మురళి కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లింగ్ మూవీ వినరో భాగ్యము విష్ణు కథ. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు ఎంతో గ్రాండ్ గా నిర్మించిన ఈ మూవీ ఇటీవల ప్రేక్షకాభిమానుల ముందుకి వచ్చి బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సొంతం చేసుకుంది.

మురళి శర్మ, శుభలేఖ సుధాకర్, ఎల్బీ శ్రీరామ్, ఆమని తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ మూవీకి చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. అయితే విషయం ఏమిటంటే, ఈ మూవీ మార్చి 22న ప్రముఖ ఓటిటి మాధ్యమం ఆహా ద్వారా బుల్లితెర ఆడియన్స్ ముందుకి రానుంది. ఈ విషయాన్ని కొద్దిసేపటి క్రితం ఆహా వారు అఫీషియల్ గా అనౌన్స్ చేసారు. మరి థియేటర్స్ లో సక్సెస్ అయిన ఈమూవీ ఓటిటి ఆడియన్స్ ని ఎంతమేర అలరిస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు