3 కోట్ల ఖరీదైన సెట్ కి కరోనా ఎఫెక్ట్.

3 కోట్ల ఖరీదైన సెట్ కి కరోనా ఎఫెక్ట్.

Published on Mar 27, 2020 10:00 PM IST

మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం మోసగాళ్లు. దేశంలోని అతిపెద్ద ఐటీ స్కామ్ ఆధారంగా క్రైమ్ థ్రిల్లర్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇప్పటికే చాలా భాగం ఈ చిత్ర షూటింగ్ పూర్తయినట్లు సమాచారం. ఐతే హైదరాబాద్ శివారులో దాదాపు 3కోట్లకు పైగా బడ్జెట్ తో ఓ భారీ ఐటీ కంపెనీ ఆఫీస్ సెట్ వేశారట. ఈ భారీ సెట్ నందు కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరగాల్సివుంది. ఐతే కరోనా వ్యాప్తి ప్రమాద స్థాయిలో కొనసాగుతున్న నేపథ్యంలో షూటింగ్ నిలిపివేశారట

సినిమా సిబ్బంది మరియు నటుల ఆరోగ్య భద్రత రీత్యా ఆ ఖరీదైన సెట్ లో చిత్రీకరణ ఆపివేశారట. ఇక హాలీవుడ్ ఫేమ్ జెఫరీ చిన్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తుండగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ఓ కీలక రోల్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు