ఊరూరా మెడికల్ క్యాంపులు ఇంటింటికి వైద్య సేవలతో జగనన్న ఆరోగ్య సురక్ష

ఊరూరా మెడికల్ క్యాంపులు ఇంటింటికి వైద్య సేవలతో జగనన్న ఆరోగ్య సురక్ష

Published on Nov 5, 2023 12:20 AM IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం రాష్ట్రాన్ని పలు అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు తీసుకెళ్తున్నారు. అటు విద్యార్థులకు, రైతులకు మాత్రమే కాదు ముఖ్యంగా సరైన వైద్యం అందని నిరుపేదలకు సైతం ఆయన అందిస్తున్న ఆపన్న హస్తం ఎందరో జీవితాల్లో వెలుగుని నింపుతోంది. రాష్ట్రంలో ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలన్న సత్సంకల్పంతో సీఎం వైయస్ జగన్ సురక్ష పేరుతో అందరికీ అందుబాటులో వైద్యసేవలు తీసుకొచ్చారు. వృద్ధులు, వికలాంగులు, ఇల్లు కదల్లేనివాళ్ళు మరి వీళ్ళందరికీ ఎలా ఎవరు ఏవిధంగా వైద్యం చేస్తారు అలానే దైన్యంలో ఉన్నవారికి వైద్యం ఎవరు చేస్తారు అనే సందేహాలన్నింటికీ జగన్ ప్రభుత్వం సరైన సమాధానం అందించింది. ఇప్పడు అలాంటి వారిపట్ల సీఎం వైయస్ జగన్ దేవుడయ్యారు. 

తన ప్రతినిధులుగా ఇంటింటికీ వైద్య సిబ్బందిని పంపిస్తున్నారు. ఎవరెవరికి ఏయే ఆరోగ్య సమస్యలు ఉన్నాయో పరీక్షలు చేసి, అక్కడికక్కడే మందులు ఇచ్చి, అవసరం ఐతే పెద్ద ఆస్పత్రికి పంపే ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో ఇంటింటికి డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బంది రాకతో ప్రజలకు తమ గుమ్మం ముందే వైద్యం అందుతోంది. సెప్టెంబర్ 30న మొదలైన ఈ బృహత్తర కార్యక్రమం ఇన్ని రోజులుగా కోట్లాదిమందికి సేవలు అందిస్తూ విజయవంతంగా ముందుకు సాగుతోంది. ప్రతి ఇంటా ఆరోగ్యాన్ని పంచుతోంది. ఇప్పటివరకూ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 12000 వైద్య శిబిరాలు నిర్వహించగా 60.9 లక్షల మంది ప్రజలు హాజరయ్యారు. అందులో 59. 2 లక్షలమందిని వైద్య సిబ్బంది, డాక్టర్లు పరీక్షించారు. 

ఇప్పటివరకూ 1. 44 కోట్ల గృహాలను వైద్య సిబ్బంది సందర్శించి 6.4 కోట్ల పరీక్షలు చేశారు. 3. 78 కోట్లమందికి ఆరోగ్య స్క్రీనింగ్ పరీక్షలు చేపట్టారు. గ్రామ వార్డు సచివాలయాల స్థాయిలో 13,930 వరకూ శిక్షణ శిబిరాలు నిర్వహించారు. ఇక 1. 38 కోట్ల కుటుంబాలను వార్డు, గ్రామ వాలంటీర్లు సందర్శించి ప్రజల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ  విధంగా ఇంటింటికీ వైద్యం అందిస్తున్న సీఎం వైయస్ జగన్ అందరి ఇళ్లలో ఆరోగ్యం రూపంలో నిలిచారు. మొత్తంగా సీఎం జగన్ చెప్పిన ఈ బృహత్కార్యం పట్ల రాష్ట్రవ్యాప్తంగా హర్షం వ్యక్తం అవుతుండడంతో పాటు రాబోయే ఎన్నికల్లో ఇది ఆయన గెలుపుకు ఇది తప్పక నాంది పలుకుతుందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు