ప్రస్తుతం ఏపీ రాష్ట్రంలో అధికార వైసిపి చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలు, చేస్తున్న సంక్షేమానికి ప్రజల నుండి మంచి స్పందన లభిస్తోంది. అయితే మరోవైపు టీడీపీ, జనసేన పార్టీ నేతలకి మాత్రం అవి కనబడడం లేదు సరికదా లేనిపోనివి ఎత్తి చూపి విమర్శలు చేస్తున్నారు.
నేడు నూతన సంత్సరం సందర్భంగా రాత్రి గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో మంత్రి విడదల రజిని కార్యాలయంపై టీడీపీ జనసేన కార్యకర్తలు దాడి చేశారు. కార్యాలయంలోకి దూసుకెళ్లడంతో పాటు అద్దాలు పగలగొట్టి, ఫ్లెక్సీలు చించి వేసి విధ్వంశం సృష్టించారు.
కొత్త సంవత్సరంలో బీసీలపై దాడులు మొదలుపెట్టిన టిడీపీ జనసేన నాయకులు ఏకంగా ఒక బీసీ మహిళా మంత్రి పైనే దాడులకి దిగి బీసీలని రాజకీయంగా అణగదొక్కాలని చూస్తున్నారు. ఇకనైనా వారు సరైన తీరున నడుచుకోకపోతే రాబోయే 2024 ఎన్నికల్లో వారికి ఘోర ఓటమి తప్పదని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.