ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం రూ. 742 కోట్లతో వైయస్ఆర్ సుజలధార

ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం రూ. 742 కోట్లతో వైయస్ఆర్ సుజలధార

Published on Dec 12, 2023 8:27 AM IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఏపీ ప్రజల నుండి మంచి స్పందన లభిస్తోంది. దాదాపుగా అధికారం చేపట్టిన నాలుగున్నరేళ్ల నుండి అనేక పథకాలతో పాటు పలు అబివృద్ది కార్యాకమాలకు ఆయన శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా దశాబ్దాలుగా ఉద్దానం వాసులను వేధిస్తున్న కిడ్నీల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు సిద్ధం అయ్యారు జగన్. తన పాదయాత్ర సమయంలో అక్కడి ప్రజలు పడుతున్న బాధలు స్వయంగా చూసి చలించిపోయారు. తాను అధికారంలోకి వస్తే వారి బాధలకు శాశ్వత పరిష్కారం చూపిస్తానని ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ రాజకీయ లబ్ది కోసం గత ప్రభుత్వాలు చేసిన మాదిరిగా కాకుండా శాశ్వత పరిష్కరానికి సిద్ధం అయ్యారు. పలాసలో 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని సుమారు 50 కోట్లకు పైగా ఖర్చుచేసి నిర్మించారు. 

దానికి డాక్టర్‌ వైఎస్సార్‌ కిడ్నీ రీసెర్చ్‌ హాస్పిటల్‌ గా ప్రభుత్వం నామకరణం చేసింది. కిడ్ని వ్యాధికి గల మూల కారణాల పై పరిశోధన చేసి నివేదిక సిద్దం చేసింది. రోగం వచ్చాక ట్రీట్ మెంట్ చేయడం కాకుండా రోగం రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రణాళఇక సిద్దం చేశారు. కార్పోరేట్ స్థాయి వైద్యం ఇక నుండి ప్రతి ఒక్క పేదవాడికి అందేలా చర్యలు తీసుకుంటున్నారు. కిడ్ని రోగంతో ఏ ఒక్కరూ బాధపడకూడదనే తలంపుతో జగనన్న ఇచ్చిన హమీ మేరకు ఆస్పత్రి నిర్మాణం చేయడమే కాకుండా, రోగానికి మూలమైన నీటి విషయమై కూడా శ్రద్ధ వహించి స్వచ్ఛమైన నీరు అందించేందుకు సుమారు 700 కోట్ల వ్యయంతో సుజలధార ప్రాజెక్టును జగనన్న ప్రభుత్వం నిర్మించింది.

పలాస, వజ్రపుకొత్తూరు, మందస, సోంపేట, కవిటి, కంచిలి, ఇచ్ఛాపురం మండలాల్లోని ప్రజలకు వంశధార నది నుంచి స్వచ్ఛమైన తాగునీటిని అందించే లక్ష్యంతో ప్రభుత్వం ప్రాజెక్టును చేపట్టింది. ఒక్కొక్కరికి రోజుకు వంద లీటర్లు చొప్పున నీటిని సరఫరా చేయాలన్నదే ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఈ నెల 14న సీఎం వైయస్ జగన్ గారి చేతుల మీదుగా ఈ ప్రాజెక్ట్ వైభవంగా ప్రారంభం కానుంది. ఇక ఉద్దానం కిడ్ని రోగులకు శాశ్వత పరిష్కార దిశగా అడుగులు వేస్తున్న జగన్ ని శ్రీకాకుళం జిల్లా వాసులు గుండెల్లో పెట్టుకున్నారు. ఇన్నేళ్ళుకు తమ సమస్య పరిష్కారం కాబోతుందని జిల్లా వాసులు ఆనందపడుతున్నారు. 

బతుకుపై ఆశను కలిగించిన జగనన్నకు జీవితాంతం రుణపడి ఉంటామని ఉద్దానం ప్రజలు అంటున్నారు. గత ప్రభుత్వాల దృష్టికి తీసుకు వెళ్ళినా ఫలితం లేకుండా పోయింది. కంటితుడుపు చర్యలుగా మాత్రమే చేసి పబ్లిసిటీ చేసుకున్నారు తప్ప తమ సమస్యలను పరిష్కరించలేదు. ఇక ఇది మా ఖర్మ అనుకుంటున్నా తరుణంలో సీఎం వైయస్ జగనన్న పాదయాత్రలో ఆ ప్రాంతాన్ని సందర్శించి వారి బాధలని అర్థం చేసుకుని అధికారంలోకి వచ్చాక ఆ మహమ్మారిని రూపుమాపుతానని ఏదైతే హమీ ఇచ్చారో అది నేరవేరడంతో ఉద్దానవాసుల జీవితాలు వెలుగులు నిండబోతున్నాయి. మొత్తంగా మరొక్కసారి ఇంతటి బృహత్కార్యంతో ప్రజల నుండి మన్ననలు అందుకుంటున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు