‘ధోని’ తదుపరి షెడ్యూల్ హైదరాబాద్ లో

‘ధోని’ తదుపరి షెడ్యూల్ హైదరాబాద్ లో

Published on Nov 11, 2011 2:05 PM IST

త్వరలో రాబోతున్న ప్రకాష్ రాజ్ ద్విభాషా చిత్రం ‘ధోని’ చిత్రీకరణ పాండిచ్చేరి లో పూర్తయింది. చివరి షెడ్యూల్ హైదరాబాద్ లో చిత్రీకరిస్తారు. ఇటీవలే పాండిచ్చేరి లో ఒక పాట షూట్ చేసారు. ఈ సినిమాలో ప్రభుదేవ అతిధి పాత్రను పోషిస్తున్నారు. ఇళయరాజా సంగీతమందిస్తోన్న ఈ చిత్రానికి కెవి గుహన్ సినిమాటోగ్రాఫర్.

ఈ చిత్రం తెలుగు, తమిళ్ భాషల్లో నిర్మిస్తున్నారు. ప్రకాష్ రాజ్ ఈ చిత్రానికి నిర్మాతే కాదు, ప్రధాన పాత్రను సైతం పోషిస్తున్నారు. ఆకాష్(పూరీ జగన్నాథ్ కొడుకు), రాధిక ఆప్టే, ఇంకా నాజర్ ఈ సినిమాలో ప్రధాన తారాగణం. పిల్లల ఆకాంక్షలకు తండ్రుల నిర్ణయాలు ఎలా ప్రతిబంధకంగా ఉంటాయన్న కథాశం తో ఈ చిత్రం సాగుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు