నెల్లూరులో బాలయ్య హవా !

నెల్లూరులో బాలయ్య హవా !

Published on Jan 17, 2018 9:19 AM IST


నందమూరి బాలక్రిష్ణ 102వ చిత్రం ‘జై సింహ’ మొదటి రోజు మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా ఆ తర్వాత తర్వాత మాస్ ప్రేక్షకుల ఆదరణతో పుంజుకుని మంచి వసూళ్లను రాబడుతోంది. నాలుగు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రూ.16.13 కోట్ల రూపాయల్ని రాబట్టిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.19.73 కోట్లను కొల్లగొట్టింది.

నెల్లూరు జిల్లాలో అయితే 5వ రోజు కూడా బ్రహ్మాండమైన రన్ ను చూపించి రూ.14.63 లక్షల్ని వసూలు చేసిన ఈ చిత్రం ఇప్పటి వరకు రూ.97.53 కోట్లను ఖాతాలో వేసుకుంది. దీంతో డిస్ట్రిబ్యూటర్లు త్వరలోనే సేఫ్ జోన్లోకి వెళ్లే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు