సూపర్ స్టార్ మహేష్ బాబు సోదరి మంజుల మొదటిసారి మెగా ఫోన్ పడుతూ ఒక సినిమాని డైరెక్ట్ చేయనున్నారు. ఈ సినిమా ఈరోజే లాంఛనంగా ప్రారంభోత్సవం జరుపుకుంది. సందీప్ కిషన్ హీరోగా నటిస్తునం ఈ చిత్రంలో త్రిధా చౌదరి, అమైరా దస్తూర్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఆనంది ఇందిరా ప్రొడక్షన్స్ బ్యానర్ పై జెమినీ కిరణ్, సంజయ్ లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ చిత్రం పూర్తి స్థాయి రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా ఉంటుందని తెలుస్తోంది. ఇకపోతే ఈరోజు ఉదయం మంజుల సోదరుడు మహేష్ బాబు తన సోదరి మొదటిసారి దర్శకత్వం చేస్తున్న సందర్బంగా ఆమెకు ట్విట్టర్ ద్వారా ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ చిత్రంలో ఇతర తారాగణం, సాంకేతిక నిపుణుల ఎవరు, ఇతర వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.
Wishing my dearest sister Manju all the best on her directorial debut !! Time to add another feather to your cap!!@IndiraProdOffl
— Mahesh Babu (@urstrulyMahesh) May 10, 2017