చివరి దశలో సుమంత్ సినిమా !

చివరి దశలో సుమంత్ సినిమా !

Published on May 24, 2018 8:34 PM IST


హీరో సుమంత్ ప్రస్తుతం చిత్రం ‘ఇదం జగత్’ చివరి దశ పనుల్లో ఉంది. ఇటీవలే షూటింగ్ పార్టీ ముగించుకున్న ఈ సినిమా ప్రస్తుతం ఎడిటింగ్, డబ్బింగ్ తలూకు పనులు జరుపుకుంటోంది. ఇప్పటి వరకు వచ్చిన అవుట్ ఫుట్ పట్ల చిత్ర యూనిట్ సంతృప్తికరంగా ఉన్నట్టు తెలుస్తోంది. కొద్దిరోజుల క్రితమే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ కు ప్రేక్షకులు, సినిమా వర్గాల నుండి మంచి స్పందన కూడ లభించింది.

కొంత నెగెటివ్ షేడ్స్ కలిగిన కథానాయకుడి పాత్ర ద్వారా నడిచే ఈ కథ సుమంత్ లోని కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తుందని చిత్ర సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అంజు కురియన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని అనిల్ శ్రీకంఠం డైరెక్ట్ చేస్తున్నారు. కమెడియన్ సత్య, కళ్యాణ్ విఠపు, షఫీ, విష్ణు, శివాజీ రాజా, ఆదిత్య మీనన్ వంటి వారు పలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ ఏడాది రెండవ సగం ఆరంభంలో ఈ చిత్ర ప్రేక్షకుల్ ముందుకొచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్న చిత్రాన్ని శ్రీ విగ్నేష్ కార్తిక్ సినిమాస్ పతాకంపై జొన్నలగడ్డ పద్మావతి, గంగపట్నం శ్రీధర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు