మరో క్రేజీ ప్రాజెక్ట్ తో రానున్న వారాహి బ్యానర్

మరో క్రేజీ ప్రాజెక్ట్ తో రానున్న వారాహి బ్యానర్

Published on Nov 29, 2015 3:31 PM IST

Jata-kalise
స్టార్స్ కంటే కథను నమ్మి వరుసగా సినిమాలు చేస్తూ విజయాలు అందుకుంటూ తమ కంటూ ఓ స్పెషల్ గుర్తింపు తెచ్చుకుంటున్న నిర్మాణ సంస్థ వారాహి చలన చిత్రం. ఈ బ్యానర్ అధినేత అయిన సాయి కొర్రపాటి కొత్త దర్శకులను, కొత్త నటీనటులను ఎంకరేజ్ చేస్తూ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. మధ్య మధ్యలో చిన్న చిన్న సినిమాలను కూడా తన బ్యానర్ ద్వారా రిలీజ్ చేసి సక్సెస్ ని అందుకుంటున్నారు. ఇటీవలే ఆయన బ్యానర్ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేసిన రాజుగారి గది సినిమా బిగ్గెస్ట్ హిట్ అయ్యింది. ఇప్పుడు తాజాగా ఆయన బ్యానర్ బ్రాండ్ తో రానున్న అదే సినిమా ‘జత కలిసే’.

రాజుగారి గది ఫేం అశ్విన్ బాబు, తెలుగమ్మాయి తేజశ్వి మదివాడ కలిసి నటించిన ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ షూటింగ్ మొత్తం ఫినిష్ చేసుకొని రిలీజ్ కి సిద్దమైంది. రాజేష్ శశి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫైనల్ కట్ చూసిన సాయి కొర్రపాటి ఈ సినిమాని తన బ్యానర్ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేసి రిలీజ్ చేయడానికి నిర్ణయించుకున్నాడు. డిసెంబర్ 25న రిలీజ్ కానున్న ఈ సినిమాకి నరేష్ రావూరి నిర్మాత. త్వరలోనే ఆడియోని కూడా రిలీజ్ చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు