తమిళ స్టార్ హీరో కార్తీకి తెలుగు సినీ అభిమానుల్లోనూ ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ ఏడాది సమ్మర్లో విడుదలై హిట్ కొట్టిన ‘ఊపిరి’ సినిమాతో తెలుగువారికి మరింత దగ్గరైన కార్తీ, తాజాగా ‘కాష్మోరా’ అనే సినిమాతో మెప్పించేందుకు సిద్ధమయ్యారు. దీపావళి కానుకగా తెలుగు, తమిళ భాషల్లో అక్టోబర్ 28న విడుదల కానున్న ఈ సినిమా ఇప్పటికే అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకొని భారీ ఎత్తున విడుదలకు సిద్ధమైపోయింది. రెండు భాషల్లో కలుపుకొని ప్రపంచవ్యాప్తంగా సుమారు 1700 థియేటర్లలో కాష్మోరా విడుదల అవుతూ ఉండడం విశేషంగా చెప్పుకోవాలి.
కార్తీ కెరీర్కి ఇదే బిగ్గెస్ట్ రిలీజ్గా చెప్పుకోవచ్చు. యూఎస్లోనూ 150కి పైనే థియేటర్లలో సినిమా విడుదలవుతోంది. ఫస్ట్లుక్, ట్రైలర్తో మంచి ఆసక్తి రేకెత్తించిన ఈ సినిమాపై అంచనాలన్నీ తారాస్థాయిలో ఉన్నాయి. పూర్తిగా గుండు కొట్టించుకొని, ఓ యుద్ధ నేపథ్యంలో నడిచే కథలో సైనికాధికారిలా కార్తీ ఈ సినిమాలో కనిపించనున్నారు. పీవీపీ సినిమా తెలుగులో విడుదల చేస్తోన్న ఈ సినిమాలో కార్తీ సరసన నయన తార, శ్రీ దివ్య హీరోయిన్లుగా నటించారు. గోకుల్ దర్శకత్వం వహించారు.