ఏపీలో నేటి నుంచి 100 శాతం ఆక్యుపెన్సీతో సినిమా థియేటర్లు నడిపేందుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంపై ఫిల్మ్ చాంబర్ హర్షం వ్యక్తం చేసింది. ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నేడు ప్రత్యేక సమావేశం నిర్వహించగా ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు నారాయణదాస్ నారంగ్, నిర్మాతల మండలి అధ్యక్షుడు సి.కళ్యాణ్ తదితరులు ఏపీ సీఎం జగన్ మరియు మంత్రి పేర్ని నానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీ కష్టాలను ఏపీ ప్రభుత్వం అర్థం చేసుకొని వంద శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లకు అనుమతి ఇవ్వడం నిజంగా సంతోషించదగ్గ విషయమని, ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి ఇండస్ట్రీ కష్టాలను తీర్చాలని, టిక్కెట్ రెట్లు, కరెంట్ బిల్లులు మొదలైన సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నట్టు తెలిపారు.
ఏపీ ప్రభుత్వానికి ఫిలిం ఛాంబర్ ప్రత్యేక ధన్యవాదాలు..!
ఏపీ ప్రభుత్వానికి ఫిలిం ఛాంబర్ ప్రత్యేక ధన్యవాదాలు..!
Published on Oct 14, 2021 9:00 PM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : “బాక్” – రొటీన్ హారర్ థ్రిల్లర్ !
- సమీక్ష : “ఆ ఒక్కటీ అడక్కు” – కొన్ని నవ్వుల కోసం మాత్రమే
- సమీక్ష : “శబరి” – ఆకట్టుకోని నాన్ ఎమోషనల్ థ్రిల్లర్
- సమీక్ష : “ప్రసన్నవదనం” – కొన్నిచోట్ల ఆకట్టుకునే ఎమోషనల్ డ్రామా!
- మే 3న ఆహా లోకి క్రైమ్ థ్రిల్లర్ ‘అసురగురు’
- ఎక్స్ క్లూజివ్ : ఈ బయోపిక్ కి వినూత్న పాత్రలో నివేత థామస్
- “లవ్ టుడే” హీరో నెక్స్ట్ మూవీ అనౌన్స్ మెంట్ వీడియో రిలీజ్!